కట్టె కాలే వరకు కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటారు – బండి సంజయ్

bandi-sanjay

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండంతో తెలంగాణ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. బిఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తాజాగా మేడిగడ్డ సందర్శన , అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరిగిన ఫైట్ ఇలా ఇవన్నీ కాకరేపాయి. ఇక నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యంగ్యస్త్రాలు సంధించారు.

‘కేసీఆర్ కొత్త భాష మొదలు పెట్టారు. కట్టె కాలే వరకు తెలంగాణ కోసం కొట్లాడతానని అంటున్నారు. ఆయన కట్టే కాలే వరకు రాష్ట్రాన్ని దోచుకుంటారు’ అని ఎద్దేవా చేశారు. రూ.లక్ష కోట్ల స్కాం చేసిన కేసీఆర్పై కేసు పెట్టాలని సీఎం రేవంత్కు చెప్పానని ప్రజాహిత యాత్రలో తెలిపారు.