జగిత్యాల జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పటు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు , మండలాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త మండలం వచ్చి చేరింది. జగిత్యాల జిల్లాలో బండలింగాపూర్‌ గ్రామం మండల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది.

మెట్‌పల్లి మండలం నుంచి రాజేశ్వరావుపేట, మేడిపల్లి(డబ్ల్యూ), రామచంద్రంపేట, విట్టంపేట, మెట్ల చిట్టాపూర్‌, జగ్గాసాగర్‌, రామ లచ్చక్కపేట, రంగారావు పేట, బండలింగాపూర్‌, ఆత్మకూరు గ్రామాలను వేరు చేసి కొత్త మండలం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ప్రజలకు అభ్యంతరాలు, సూచనలుంటే 15 రోజుల్లోగా కలెక్టర్‌కు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ కొత్త మండలం ఏర్పాటుతో రాష్ట్రంలో మండలాల సంఖ్య 613కు చేరుకోనుంది.

మరోవైపు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌ కంగ్టి మండలంలో ఉన్న బాబుల్‌గామ్‌ రెవెన్యూ గ్రామాన్ని కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌ పెద్దకొడప్‌గల్‌ మండలానికి బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ సోమవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది.