కరోనాపై నృత్యంతో అవగాహన
కళలు-ప్రతిభావంతులు
గత ఆరు నెలలుగా కరోనా ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్నది. ప్రతివారిలో వైరస్ భయాలు వెంటాడుతున్నాయి. సోషల్ డిస్టెన్స్, మౌత్మాస్క్, శానిటైజర్లతో మన జీవనవిధానం మారిపోయింది.
సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్క్లతో, శానిటైజర్లతో మనల్ని మనం కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదు.
అయితే దీనిపై ప్రజలకు ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇదే చేస్తున్నది మహిన ఖనుమ్. ఒడిస్సీ నృత్యముద్రల ద్వారా ఆమె ప్రజల్లో తగిన అవగాహన కల్పిస్తున్నారు.
ఫ్రెంచ్ మహిళ అయిన మహిన 13ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి ఒడిస్సీ నృత్యరీతులను నేర్చుకుంది.
భారతీయ నృత్యసంస్కృతిని ప్రోత్సహించే లిజ్ ఆర్ట్స్ మీడియా సంస్థకు మహిన డైరెక్టర్. స్టేహోమ్ పేరుతో మహిన చేస్తున్న శాస్త్రీయ నృత్యవీడియోలు మంచి ఆదరణ పొందుతున్నాయి.
కొన్నాళ్లుగా లాక్డౌన్ టైమ్ను కళాకారులు తమ కళను మెరుగు పరచుకోవడానికి కొత్తకొత్త ప్రక్రియలు కనిపెట్టడానికి వాడుకుంటున్నారు.
తాము చేసిన సృజనాత్మక పనులను నలుగురికీ పంచడానికి సోషల్ మీడియాను మాధ్యమంగా ఎంచుకుని అన్ని వయసుల వారు తమ అభిరుచులను వ్యక్తపరుస్తున్నారు.
ఇదేకోవలో ఫ్రాన్స్లో నివసిస్తున్న ఒడిస్సీ నృత్యకళాకారిణి, కొరియోగ్రాఫర్ మహినా ఖనుమ్ కొవిడ్-19కి సంబంధించి తీసుకోవాల్సిన రక్షణ చర్యలను ఒడిస్సీ నృత్యభంగిమల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తోంది.
నృత్యం ద్వారా పర్యావరణాన్ని కాపాడటం, మహిళా సాధికారత వంటి తీవ్రమైన సమస్యలను కూడా సులభంగా వివరించవచ్చు. నృత్యం ఒక అందమైన భాష, దీనిలో ప్రదర్శించే భంగిమలే అందుకు ఉదాహరణ.
కరోనా యుగంలో ఇ-కరెన్సీ గురించి ప్రజలకు తెలిసేలా చేసిన వీడియో నాకు బాగా నచ్చింది అని వివరించిన మహిన తన నృత్యశైలితో ప్రపంచ సమస్యలను చూపాలని తపనను వెలిబుచ్చింది.
తన భర్త అవిషాయ డిజిటల్ ఆర్టిస్ట్ కావడంతో ఈ ఆలోచన రావడానికి, ఓ కొత్తదనాన్ని కనుక్కోవడానికి కారణమైందని చెబుతుంది మహిన.
లాక్డౌన్కు ముందు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు డ్యాన్స్ఒక మార్గంలా ఉంటుందని అనుకోలేదు.
గత మార్చిలో లాక్డౌన్ ప్రక.3.టించాక, ఇంట్లోనే ఉన్నప్పుడు నాట్యాన్ని ఎలా కొనసాగించాలా అని ఆలోచించాను.
అదే సమయంలో కొవిడ్-19 గురించి ప్రజలకు తెలిసేలా కరెన్సీకి సంబంధించిన నృత్య ప్రక్రయను వీడియో చేశాను.
ఈ డ్యాన్స్ వీడియో కోసం సరైన ప్లేస్, కెమెరా యాంగిల్ కోసం కూడా చూడలేదు. నృత్యం ద్వారా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాలని భావించి, సక్సెస్ అయ్యాను.
ఈ నృత్యానికి సంగీతాన్ని ముంబై స్వరకర్త విజ§్ు తంబే స్వరపరిచారు అని ఆనందంగా వివరించింది మహిన.
మహిన తల్లి ఫ్రెంచ్, తండ్రి స్పానిష్. చిన్నప్పటి నుంచీ నృత్యంపై అమిత ఇష్టంతో మూడేళ్ల వయసులో బ్యాలే నేర్చుకుంది మహిన. 13ఏళ్ల వయసులో ఒడిస్సీ కళాకారిణి షకర్ బెహెరాను కలిసింది.
షకర్ తన జీవితానికి ఓ కొత్త దిశను ఇచ్చిందని చెబుతుంది మహిన. ఒడిస్సీ నృత్యరీతులను నేర్చుకున్న తర్వాత ఢిల్లీలోని మాధవి ముద్గల్నుండి నృత్యం నేర్చుకునే అవకాశం పొందింది.
భారతీయ నృత్యకళను పట్టాక పారిస్కు వెళ్లి అక్కడ 12 ఏళ్లుగా నివసిస్తోంది.
భర్కత అవిషాతో కలిసి మహిన ఫ్రాన్స్లో కంప్యూ టర్ యానిమేటెడ్, ఓల్డ్ పెయింటింగ్, ఒడిస్సీ డ్యాన్స్ వర్చువల్ రియాలిటీలో ఒడిస్సీ డ్యాన్స్, లైట్ పెయింటింగ్ ఫొటోగ్రఫీ వంటి ప్రాజెక్టులలో పని చేసింది.
కరోనా ప్రభావాలను నివారిచడానికి ఇంట్లో ఉన్నప్పుడు నా చుట్టూ ఎన్నో సమస్యలు కనిపించాయి.
అటువంటి పరిస్థితిలో ఒడిస్సీ నృత్యం కష్టాలన్నిటినీ అధిగమించడానికి ఓ సులభమైన మార్గంలా కనిపించింది. ఈ నృత్యం ద్వారానే ఇప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను.
సోషల్ మీడియానా నృత్యానికి వేదిక అయ్యింది అని కరోనా మహమ్మారి సమయంలో ఒడిస్సీ నృత్యం ప్రాముఖ్యత గురించి మహిన గొప్పగా చెబుతోంది.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/