అవధ్-అసోం ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
ఏసీ కోచ్లో చెలరేగిన మంటలు
పాట్నాః బీహార్లోని ముజఫర్పూర్లో అవధ్-అసోం ఎక్స్ప్రెస్కు భారీ ప్రమాదమే తప్పింది. అవధ్-అసోం ఎక్స్ప్రెస్ అసోంలోని డిబ్రూగఢ్ నుంచి బెంగాల్లోని లాల్గఢ్కు వెళ్తున్నది. ఈ క్రమంలో బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్న రామ్దయాలు స్టేషన్కు సమీపంలోకి వచ్చిన తర్వాత రైలులోని బీ2 ఏసీ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బోగీలో పెద్దఎత్తున్న పొగలు కమ్ముకున్నాయి. ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బందిపడ్డారు.
అయితే రైలు వెంటనే ఆగడంతో ప్రయాణికులందా బోగీలోనుంచి కిందికి దూకేశారు. స్పందించిన అధికారులు మంటలను అదుపుచేశారు. విచారణ నిమిత్తం రైలును తరలించారు. కాగా, మంటలు ఎందుకు అంటుకున్నాయనే విషయం ఇంకా తెలియరాలేదు. ఇరత రైళ్లలో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చారు.