రూ.100 కోసం కార్మికులు కత్తులతో దాడి: ఒకరు మృతి
అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ సెంటర్ లో ఘటన
Vijayawada: రోడ్లపై సెంట్రింగ్ కార్మికులు కత్తులతో స్వైర విహారం చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.. పలువురు గాయపడ్డారు అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ సెంటర్ సమీపంలోని దుర్గా బజార్ సెంటర్లో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో రూ.100 కోసం కార్మికులు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సెంట్రింగ్ కార్మికుడు పండు మృతి చెందాడు. ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/