ఏపి టిడిపి అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు
టిటిడిపి అధ్యక్షుడిగా ఎల్.రమణ
పొలిట్ బ్యూరో సభ్యుడిగా బాలకృష్ణ
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు తెలుగు రాష్టాలకు పార్టీ కమిటీలను నియమించారు. ఏపి అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని, తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా ఎల్.రమణను నియమించారు. టిటిడిపి ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసినిని ప్రకటించారు. 27 మందితో టిడిపి సెంట్రల్ కమిటీని, 25 మందితో పొలిట్ బ్యూరో కమిటీని ఏర్పాటు చేశారు. పొలిట్ బ్యూరోలో నందమూరి బాలకృష్ణకు స్థానం కల్పించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్రావు, టిడిపి జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావును నియమించారు.
పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల, అశోక్గజపతిరాజు, అయ్యన్న, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి, కాలవ శ్రీనివాసులు, పొలిట్ బ్యూరో సభ్యులుగా బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమా, ఫారూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్కుమార్గౌడ్ను నియమించారు. పొలిట్ బ్యూరోలో నారా లోకేష్, అచ్చెన్న, ఎల్.రమణ కూడా సభ్యులుగా ఉన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/