ఆరంగర్ – శంషాబాద్ ప్రధాన రహదారి బ్లాక్
భారీవర్షాలతో జనజీవనం అతలాకుతలం
![](https://www.vaartha.com/wp-content/uploads/2020/10/Shamshabad-road.jpg)
Hyderabad: గత రెండు రోజులగా కురుస్తున్న భారీవర్షాలతో రాజేంద్రనగర్ మండల పరిధిలోని గగన్ పహాడ్ వద్ద జీవనం స్తంభించిపోయింది,
అప్ప చెరువు కట్ట తెగిపోవడంతో ఆరంగర్ నుంచి శంషాబాద్ వెళ్ళవలసిన ప్రధాన రహదారి బ్లాక్ అయి, పెద్ద సంఖ్యలో కార్లు వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి.
సంఘటన స్థలాన్ని రాజేంద్రనగర్ ఆర్డిఓ చంద్రకళ పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
వరదలు ఒక కుటుంబం గల్లంతయింది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/