జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చి..అమరావతి రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన హైకోర్టు

cm jagan

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాజధాని రైతులకు కౌలు బకాయిల చెల్లింపు విషయంలో జగన్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పడుతూ..నాలుగు వారాల్లోపు రాజధాని రైతులకు కౌలు బకాయిలు చెల్లించాల్సిందేనని జగన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 2021 వార్షిక కౌలు చెల్లించకపోవడంపై రాజధాని రైతులు వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.

కౌలు సకాలంలో చెల్లించని కారణంగా రైతులు కుటుంబ పోషణ, వైద్య ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎన్ని సార్లు చెప్పినా కౌలు సకాలంలో ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. నాలుగు వారాల్లోపు కౌలు చెల్లించాల్సిందేనని జగన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.