హెటిరో డ్రగ్స్ సంస్థల్లో మూడో రోజు ఐటీ సోదాలు..వందల కోట్లు బయటపడ్డాయి

ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో డ్రగ్స్ పై ఐటీ అధికారుల సోదాలు మూడో రోజు కూడా జరిగాయి. సంస్థ కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, ముఖ్యమైన అధికారులు, ఉద్యోగుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. వందల కోట్ల రూపాయల నగదును కంపెనీ ఉద్యోగుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇప్పటి వరకూ పలుచోట్ల నుంచి రూ.200 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బోరబండలోని ఓ ఫ్లాట్‌లో భారీ స్థాయిలో నగదు లభ్యమైనట్లు సమాచారం. ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదును బ్యాంకుకు తరలించారు. కార్యాలయాలు, ఉద్యోగుల ఇళ్లలో లభ్యమైన నగదుకి సంబంధించి సరైన ధ్రువీకరణ పత్రాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్లు తెలుస్తోంది.