క్యాంపు ఆఫీస్ లో సీఎం జగన్ ను కలిసిన హజ్ కమిటీ సభ్యులు

సోమవారం సీఎం క్యాంపు ఆఫీస్ లో ఏపీ సీఎం జగన్ ను కలిశారు హజ్ కమిటీ సభ్యులు. కమిటీ చైర్మన్ బీఎస్ గౌస్ లాజమ్, హజ్ కమిటీ సభ్యులు మునీర్ బాషా, ముఫ్తీ బాసిత్, ఇబాదుల్లా ఖాదర్, మైనారిటీ ఎమ్మెల్సీలు ఇషాక్ బాషా, రుహుల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ కలిసి శాలువా తో సత్కారించారు.

ఈ ఏడాది హజ్ యాత్ర ముగిసిన నేపథ్యంలో, హజ్ కమిటీ సభ్యులు ఆయనకు జమ్ జమ్ వాటర్ (పవిత్ర జలం)ను అందజేశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. సీఎం చేతికి రక్షా కంకణాన్ని కట్టారు. ఆయనకు ఆప్యాయంగా మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ హజ్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీలతో ఆత్మీయంగా ముచ్చటించారు. హజ్ యాత్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీలు, హజ్ కమిటీ సభ్యులు మైనారిటీలకు సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.