రోడ్డుమీద కుక్కలు ఆలా వాగుతూనే ఉంటాయంటూ మంత్రి తలసాని ఫైర్

ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని రవీంద్ర భారతి లో నిర్వహించిన ఐలమ్మ 127వ జయంతి వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రమాదవశాత్తు రైతు చనిపోతే తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తుందని.. ఇలా ఏ ప్రభుత్వమైనా ఇస్తుందా అని ప్రశ్నించారు. రోడ్డుమీద కుక్కలు వాగుతూనే ఉంటాయని అన్నారు.

రైతు బీమా, రైతుబంధు లాంటి పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వేల, వందల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేస్తున్నారని , రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కడు కేసీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని బిజెపి నేతలపై పరోక్షంగా మాట్లాడారు.