ఏపీ ఈసెట్ 2024 ఫలితాలు విడుదల

AP ECET 2024 Results Released

అమరావతి: జేఎన్టీయూలో ఏపీ ఈసెట్ 2024(ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలు విడుదల అయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఈసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈసెట్ ఫలితాలలో విద్యార్ధినులు 93.34 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ప్రకటించారు.

89.35 శాతం విద్యార్ధుల ఉత్తీర్ణత వచ్చినట్లు చెప్పారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి. ఈసెట్ ఫలితాలలో హైదరాబాద్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉందని… అత్యల్పంగా విజయనగరం జిల్లా ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి. ఏపీ ఈసెట్ 2024(ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాల కోసం https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx ఈ వెబ్‌ సైట్‌ చూసుకోవాలని అధికారులు ప్రకటించారు.