రిషి కపూర్ చివరి విన్నపం
వైద్య సిబ్బందిపై దాడులు చేయవద్దు.. ఏప్రిల్ 2న పెట్టిన చివరి ట్వీట్

ముంబై: బాలీవుడ్ అగ్ర నటుడు రిషి కపూర్ (67 ) ఈ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే .ఐతే తాను కనుమూసే చివరి క్షణం వరకూ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో నవ్వుతూ, సరదాగా గడిపిన ఆయన, ఏప్రిల్ 2న తన చివరి ట్వీట్ పెట్టారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఆయన, ఈ ట్వీట్ లో ఆయన తన అభిమానుల ముందు ఓ విన్నపాన్ని ఉంచారు. అదే ఇప్పుడాయన చివరి కోరికగా మిగిలింది. ” కరోనా వైరస్ ను తరిమేసేందుకు నిర్విరామంగా పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పోలీసుల పట్ల హింసను మానుకోవాలని ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. మనకోసం వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అలాంటి వారిపై దాడులకు దిగవద్దు… జై హింద్” అని రిషి కపూర్ కోరారు. ఆ తరువాత, ఆయన మరో ట్వీట్ ను పెట్టలేదు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి ;https://www.vaartha.com/news/national/