జగన్ ప్రధాని అయ్యే అవకాశం – డిప్యూటీ సీఎం నారాయణ

ap deputy cm sensational comments

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 15 ఏళ్ల తర్వాత దేశ ప్రధాని అయ్యే అవకాశం ఉందని తెలిపి వైసీపీ కార్య కర్తల్లో ఉత్సహం నింపారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఈరోజు శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఏ పని తలపెట్టిన దానికి దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉంటాయని.. మంత్రి పదవుల విషయంలో అందరూ ముఖ్యమత్రి మాటకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సంతోషంగా స్వీకరిస్తామన్నారు. మరో 15 సంవత్సరాల తరువాత జగన్ కు దేశ ప్రధాని అయ్యే అవకాశం ఆ భగవంతుడు ఇస్తాడని నారాయణ స్వామి అన్నారు. తాము ఎల్లప్పుడు ఆయనకు తోడు నీడగా ఉంటూ.. అడుగులో అడుగు వేసి ముందుకు వెళతామన్నారు.