అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

Amaravati: అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఏపీ లో 3 రాజధానులు బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 705 రోజులుగా నిర్విరామంగా సాగుతున్న పోరాటానికి ఇది తొలి విజయమని పేర్కొన్నారు. అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/