నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్

అమరావతి: ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్తున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన ఢిల్లీ వెళ్తారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. హోంమంత్రి అమిత్‌ షా, జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, రైల్వే శాఖ మంత్రి గోయల్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్‌ కలుసుకుంటారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చిస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/