ఏపీ కేబినెట్‌ భేటీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతిః ఏపీ కేబినెట్‌ భేటీ షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 15వ తేదీన ఏపీ కేబినెట్‌ సమావేశం జరుగనుంది. ముందుగా ఈ నెల 14న మంత్రి మండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ కొన్ని అని వార్య కారణాల వల్ల… ఏపీ కేబినెట్‌ భేటీ షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది. దీంతో ఈ నెల 15వ తేదీన ఏపీ కేబినెట్‌ సమావేశం జరుగనుంది.

ఇది ఇలా ఉండగా, ఈ నెల 14న శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మకరంపురం గ్రామంలో ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్‌ఆర్‌ సుజలధార ప్రాజెక్ట్ ను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం పలాసలో వైయస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఈ నెల 14న శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటించనున్న తరుణంలోనే.. ఏపీ కేబినెట్‌ భేటీ షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుందని తెలుస్తోంది.