రెండో రోజు ఏపీ అసెంబ్లీ వాయిదా..

ఏపీ అసెంబ్లీ లో రెండో రోజు కూడా అదే గందరగోళం నెలకొంది. మొదటి రోజు ఎలాగైతే టీడీపీ నేతలు పోడియం చుట్టుముట్టి చంద్రబాబు ఫై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసారో..రెండో రోజు కూడా అదే తరహాలో డిమాండ్ చేయడం తో ఐదు నిమిషాల పాటు స్పీకర్ అసెంబ్లీ ని వాయిదా వేశారు.

నిన్న సభ మొత్తం కూడా టీడీపీ నేతల ఆందోళనలతో దద్దరిల్లింది. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టడం, మంత్రులు, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగడం, కొందరు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం.. వంటి చర్యలతో మొదటి రోజు ముగిసిపోయింది. రెండో రోజు స్కిల్ డెవలప్మెంట్ స్కాం చర్చలో తమకూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరనున్నారు.