కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ

బిక్కనూరు : నేడు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి కంచర్ల మల్లు పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ప్రయోజనాలను వివరించారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుతింటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడంతో పాటు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎకరాకు పదివేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు భీంరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మోహన్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంకం రాజు, నాయకులు దయాకర్ రెడ్డి, బాగా రెడ్డి, సురేందర్ రెడ్డి, సుదర్శన్, లింగా రెడ్డి, నరేందర్ రెడ్డి, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/