వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్లెక్సీలు కట్టుకోవద్దట!
అమరావతి: వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్లెక్సీలు కట్టుకోవడంపై అభ్యంతరం తెలిపిన చంద్రబాబును ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవద్దట. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా చంద్రబాబు? అని ప్రశ్నించారు. ఎవడబ్బ సోమ్మని ఫెక్సీలు కడతారని చించుకుంటున్నావు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశావు ఇంతగా పతనమవుతావని అనుకోలేదు అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/