పేదల కడుపు కొట్టే పనులు చేయొద్దు

వసంత నాగేశ్వరరావుకు దేవినేని ఉమ వార్నింగ్

devineni uma
devineni uma

అమరావతి: టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరావు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సిపి వసంత నాగేశ్వరరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గుట్ట, పురగుట్ట స్థలాలను రద్దు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చిరించారు. పేదల కడుపు కొట్టే పనులు చేయవద్దని… పద్ధతి మార్చుకోకపోతే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. తింగరి వేశాలు మానుకోవాలని హితవు పలికారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైయస్సార్ మద్యం పథకం కింద
వైఎస్‌ఆర్‌సిపి నేతలు అధిక ధరలకు మందు అమ్ముతున్నారని ఆరోపించారు. ఏడాదికి రూ. 3 వేల కోట్ల జేట్యాక్స్ వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/