అనంతపురంలో చంద్రబాబు పర్యటన
అనంతపురం: టిడిపి అధినేత చంద్రబాబు అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా నేడు అనంతపురంలో పర్యటిస్తున్నారు. రాజధాని కోసం అమరావతి పరిరక్షణ సమితి ఐకాసతో కలిసి కొడికొండ చెక్పోస్టు దగ్గర జోలే పట్టి చంద్రబాబు విరాళాలు సేకరిస్తున్నారు. అనంతరం పెనుకొండ చేరుకొని రోడ్షోలో పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రం అనంతపురంలో పండ్లు, టీ విక్రయించి చంద్రబాబు నిధులు సేకరించనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/