చంద్రబాబు జైలుకు వెళ్లడంతో సంబరాలు చేసుకున్న మంత్రి రోజా

టీడీపీ అధినేత చంద్రబాబు జైలు కు వెళ్లడంఫై యావత్ తెలుగు ప్రజలు అయ్యో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటే..వైసీపీ నేతలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మంత్రి రోజా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంత పెద్దయ్యానా..ఈ వయసు లో జైలు కు వెళ్లడం అనే జాలి కూడా లేకుండా స్వీట్స్ ట్ పంచుతూ..బాణా సంచా కాలుస్తూ సంబరాలు చేసుకోవడం..తెలుగు ప్రజలు ఛీ కొడుతున్నారు, ఓ ఉన్నత స్థాయిలో మంత్రి పదవిలో ఉండి..ఇలా ప్రవర్తించడం ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు. అన్ని రోజులు మనవే కావని..ముందు ఉంది ముసళ్ల పండగ అని హెచ్చరిస్తున్నారు.

చంద్రబాబుకు ఆరంభం మాత్రమేనని, అంతం కాదని ఆమె అన్నారు. పైనుంచి దేవుడు చూస్తున్నాడని, చంద్రబాబుకు శిక్ష వేస్తాడని అన్నారు. చంద్రబాబు ఎంతో మంది ఉసురు పోసుకున్నారని, అందరి జీవితాలతో ఆడుకున్నారని ఆమె అన్నారు. ఇంకా మరిన్ని కేసుల్లో చంద్రబాబు జీవితాంతం జైలులో చిప్ప కూడు తింటారని రోజా అన్నారు. సరైన సమయంలో దేవుడు చంద్రబాబు పాపాలకు శిక్ష వేశాడని ఆమె అన్నారు.