అప్పుడే ఇయర్ ఎండింగ్ పార్టీ ని స్టార్ట్ చేసిన యాంకర్ రష్మీ

యావత్ లోకం ఇయర్ ఎండింగ్ పార్టీ ని గ్రాండ్ గా జరుపోకోవాలని..న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్ కం చెప్పాలనే మూడ్ లో ఉన్నారు. ఇప్పటికే వారి వారి ప్లాన్లతో సిద్ధమయ్యారు. హోటల్స్ , బార్స్ , రెస్టారెంట్స్ ఇలా అన్ని కూడా భారీ ఆఫర్లు ప్రవేశపెట్టి ఆకర్షిస్తున్నాయి. ఇక సినీ తారల గురించి చెప్పాల్సిన పనేలేదు. వాళ్ల స్టేటస్ కు తగ్గట్లు అదే రేంజ్ లో ఇయర్ ఎండింగ్ పార్టీలను జరుపుకుంటారు.

తాజాగా యాంకర్ రష్మీ ముందే ఇయర్ ఎండింగ్ పార్టీలో మునిగితేలుతోంది. తన ఫ్రెండ్స్ తో కలిసి మందు పార్టీ చేసుకుంటోంది. పైగా పార్టీ చేసుకుంటూ గ్లాస్ లో మందు పోసుకున్న పిక్స్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. మరి రష్మీ పోస్ట్ చేసిన పిక్స్ లో రెండు గ్లాస్ లు కనిపిస్తున్నాయి. ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనంటే.. మరో గ్లామర్ బ్యూటీ దీపికా పిల్లి, వేరొక ఫ్రెండ్ ఉన్నట్లు సమాచారం. ఢీ ప్రోగ్రామ్ నుండి రష్మీ, దీపికా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటినుండి రెగ్యులర్ గా ఏ స్పెషల్ ఈవెంట్స్, పార్టీస్ ఉన్నా కలిసి అటెండ్ అవుతుంటారు. ఆ మధ్య ఇద్దరు కలిసి గోవా కూడా వెళ్లి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. మరి ప్రస్తుతం యాంకర్ రష్మీ మందు పార్టీకి సంబంధించి పిక్స్ వైరల్ అవుతున్నాయి .