విజయ్, నేను లోగడ స్నేహితులమే – అనసూయ

విజయ్ దేవరకొండ – అనసూయల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సమయం నుండి మొన్నటి ఖుషి పోస్టర్ వరకు అనసూయ ..విజయ్ సినిమా లపై తన కామెంట్స్ ను తెలియజేస్తూ వస్తుంది. ఈ క్రమంలో అనసూయ ఫై విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ..సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో అసలు విజయ్ కి తనకు ఎక్కడ గొడవ వచ్చిందనేది తెలిపింది.

‘‘విజయ్, నేను లోగడ స్నేహితులమే. అప్పుడు ఏ సమస్యా లేదు. అర్జున్ రెడ్డి (2017) విడుదల అయిన తర్వాతే పరిస్థితి మారింది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ బూతులను మ్యూట్ చేశారు. విజయ్ ఓ థియేటర్ ను సందర్శించినప్పుడు వాటిని ఆన్ స్క్రీన్ పై వేశారు. వాటిని పలకాలని విజయ్ దేవరకొండ అభిమానులను కోరాడు. వారు ఆ బూతు పదాలను మాట్లాడారు. విజయ్ సినిమాలో ధూషించే పాత్రను పోషించాడు. సినిమా వరకు బాగానే ఉంది. కానీ, నిజ జీవితంలో ప్రేక్షకులను ఆ పదాలు పలికేలా ప్రోత్సహించడం ఏంటి? ఓ తల్లిగా ఇలాంటి అసభ్యకర పదాలు నన్ను బాధిస్తాయి. నేను దీనిపై విజయ్ తో మాట్లాడాను. నిజజీవితంలో వాటిని ప్రోత్సహించొద్దని కోరాను’’ అని , ఆన్ లైన్ లో మహిళలను యువత దూషించడం పెరిగిపోయినట్టు అనసూయ తెలిపింది.

విజయ్ దేవరకొండ తండ్రి 2019లో ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాని నిర్మిస్తున్న సమయంలో తనకు పాత్రను ఆఫర్ చేసినట్టు అనసూయ తెలిపింది. ‘‘విజయ్ ప్రచారకర్త తనను దర్భాషలాడుతూ పోస్టులు పెట్టినట్టు అతడి బృందానికే చెందిన ఒకరు నాకు చెప్పారు. ప్రచారకర్త పెయిడ్ ట్రోల్స్ చేస్తున్నప్పుడు దానిపై విజయ్ కు అవగాహన ఉంటుంది కదా? అతడికి తెలియకుండా వారు ఇలాంటివి చేయరని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని అనసూయ తన ఆవేదన వ్యక్తం చేసింది.