నేడు హైదరాబాద్ కు కేంద్రమంత్రి అమిత్ షా రాక ..

బిజెపి అగ్ర నేత, కేంద్రమంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ కు రాబోతున్నారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న ఆయన.. రేపు జరగబోయే కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్‌) 54వ వ్యవస్థాపక దినోత్సవం (రైజింగ్‌ డే) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

శనివారం సాయంత్రం 6:15కు ఢిల్లీలో అమిత్ షా బయలుదేరి.. రాత్రి 8.25కు హకీంపేట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మేడ్చల్‌‌‌‌ జిల్లా హకీంపేట్‌‌‌‌లోని నేషనల్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ సెక్యూరిటీ అకాడమీ(ఎన్‌‌‌‌ఐఎస్‌‌‌‌ఏ)కి వస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

రాత్రి 9.30కు అధికారులతో భేటీ అవుతారు. ఆదివారం ఉదయం 7.30 నుంచి 9.16 వరకు సెంట్రల్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌) 54వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా నిర్వహించే రైజింగ్‌‌‌‌ డే పరేడ్‌‌‌‌లో పాల్గొంటారు. తర్వాత 11.45 గంటలకు హకీంపేట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు చేరుకొని, కేరళ వెళ్లనున్నారు.