సీఎం జ‌గ‌న్ తో.. క్రికెట‌ర్ అంబ‌టిరాయుడు భేటీ

ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు ..ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యానికి వచ్చిన రాయుడు..జగన్ తో భేటీ అయ్యారు. కొన్నిరోజుల కిందట సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ ప్రసంగించగా, ఆ స్పీచ్ ను అంబటి రాయుడు రీట్వీట్ చేశారు. అంతేకాదు, ఏపీలో ప్రతి ఒక్కరికీ మీపై విశ్వాసం ఉంది సర్ అంటూ వ్యాఖ్యలు చేశాడు.

గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు రాజకీయాల్లోకి రావడంపై కొంతకాలంగా ఆసక్తి చూపిస్తున్నాడు. జనసేనలో చేరతాడని ప్రచారం జరిగింది. టీడీపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఓ పత్రికా కథనం పేర్కొంది. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాయుడు వైస్సార్సీపీ లో చేరడతానే వాదనలకు బలం చేకూరుతోంది. కాగా తాజాగా రాయుడు సీఎం జగన్ ను తాడేపల్లి ఆఫీస్ లో కలిసి రాష్ట్రంలోని క్రీడల అభివృద్ధి, శిక్షణ మరియు యువతకు అవకాశాలను కల్పించాలి అన్న పలు విషయాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయాలపై జగన్ కూడా సానుకూలంగా స్పందించారట.