చంద్రబాబుకు మూడు ప్రశ్నలు సంధించిన అంబటి

జాతీయ ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మించాలని ఎందుకు అనుకున్నారు?

ambati-rambabu-three-questions-to-chandrababu

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి పోలవరం పర్యటన నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు ఆయనకు ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు గారూ! పోలవరం వస్తున్నారు కాబట్టి నేను వేసిన మూడు ప్రశ్నలకు ఇప్పుడైనా సమాధానం ఇస్తారా? అని ప్రశ్నించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దీనిని కేంద్రం నిర్మించాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్రమే నిర్మించాలని ఎందుకు అనుకున్నారు? కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్‌ను ఎలా నిర్మించారు? 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఎందుకు విఫలమయ్యారు? అని మూడు ప్రశ్నలు సంధించారు. అంబటి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు.