ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల్లో కరోనా ఆందోళన
‘వర్క్ ఫ్రం హోం’ ఇవ్వాలని వినతి
Amravati: ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు , సిబ్బంది లో కరోనా వైరస్ ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొందరు కరోన బారిన పడిన విషయం తెలిసింది. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు కరోనాతో మృతి చెందారు.అంతేకాకుండా సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఉద్యోగి కరోనాతో మృతి చెందారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ‘వర్క్ ఫ్రం హోం ‘ సదుపాయం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/