మేజర్ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..మేజర్ మూవీ ఫై ప్రశంసల జల్లు కురిపించారు. మొదటి నుండి విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న నటుడు అడివి శేష్..తాజాగా మేజర్ మూవీ తో నిన్న( జూన్ 03 న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. శేష్ ఈ మూవీ లో హీరోగా నటించడమే కాకుండా కథ – స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు.

శశి కిరణ్ తిక్క ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించగా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అడివి శేషు యాక్టింగ్ ఫై , శశి డైరెక్షన్లపై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు. అలాగే సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ కురిపిస్తుండగా..తాజాగా ఈ జాబితాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేరారు.

‘‘సినిమా గుండెకు హత్తుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ది షో అడివి శేష్‌ మరోసారి మ్యాజిక్‌ చేశాడు. కథలో కీలక పాత్రలకు ప్రకాశ్‌రాజ్‌, రేవతి, సయీ మంజ్రేకర్‌, శోభితా దూళిపాల చక్కని సపోర్ట్‌ అందించారు. దర్శకుడు శశి కిరణ్‌ తిక్కా తన ప్రతిభ చూపించారు. శ్రీచరణ్‌ పాకాల బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది. ప్రేక్షకులకు ఇంత మంచి చిత్రాన్ని అందించిన నిర్మాత మహేశ్‌గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ‘మేజర్‌’ కథ ప్రతి భారతీయుడి గుండెను హత్తుకుంటుంది’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇక ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 1.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 46 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 51 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 24 లక్షలు, గుంటూరులో రూ. 30 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 4.07 కోట్లు షేర్, రూ. 6.85 కోట్లు గ్రాస్ రాబట్టింది. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.35 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 35 లక్షలు వచ్చాయి. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 7.12 కోట్లు షేర్‌తో పాటు రూ. 13.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.