జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. బుడ్గాం పరిధిలోని జోల్వా క్రాల్పోరా ఛదూరా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారినుంచి 3 ఏకే 47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గురువారం రాత్రినుంచి స్థానిక పోలీసులు, బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని.. ఈ ప్రాంతంలో ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/