మే 4 న ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్
ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ఆదిపురుష్. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా ఈ చిత్రం నుండి సరికొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్ర ట్రైలర్ ను మే 4 న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ఈ ట్రైలర్ 3 నిమిషాల నిడివితో ఉంటుందంట. హై స్టాండర్డ్స్ లో నెక్స్ట్ లెవల్ లో ఈ ట్రైలర్ ని ఓం రౌత్ రెడీ చేసారని , ఈ ట్రైలర్ తో మూవీ పై అంచనాలు భారీగాపెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.