మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన నటి తమన్నా

సామాన్యులు రాజకీయాల్లోకి రావడానికి ఈ బిల్లు తోడ్పడుతుందన్న మిల్కీ బ్యూటీ

Actress Tamannaah reacts on women’s reservation bill

న్యూఢిల్లీః సినీ నటి తమన్నా భాటియా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. గురువారం మధ్యాహ్నం భవనాన్ని సందర్శించిన నటి, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా స్పందించారు. సామాన్యులు రాజకీయాల్లోకి రావడానికి ఇది దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. ఎరుపు రంగు చీరలో వచ్చిన మిల్కీ బ్యూటీని ప్రధాన ద్వారం వద్ద మీడియా ప్రతినిధులు మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందన కోరారు. కొత్త పార్లమెంట్ భవనంలో కొత్త భవనంలో నిన్న దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

నటి దివ్యా దత్త కూడా పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చొరవ అద్భుతమన్నారు. ప్రతి అంశంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు బాగుందన్నారు.

కాగా, ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్ కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. క్రికెటర్ మిథాలి రాజ్, బాక్సర్ మేరీకోమ్, హాకీ క్రీడాకారిణి రాణి రామ్‌పాల్, పారాఒలింపిక్ అథ్లెట్ దీపా మెహతా సందర్శించిన వారిలో ఉన్నారు.