హాస్పటల్ లో చేరిన సీనియర్ నటుడు శరత్‌ కుమార్

తమిళ్ సీనియర్ నటుడు శరత్‌ కుమార్ అనారోగ్యంతో హాస్పటల్ లో చేరారు. డీహైడ్రేషన్‌ కారణంగా ఆదివారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం డాక్టర్స్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ ఆస్పత్రికి చేరుకున్నారట. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరికాసేపట్లో ఆసుపత్రి వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేస్తారని సమాచారం. శరత్‌ కుమార్‌ అనారోగ్యం వార్త తెలియగానే.. తమిళ సినీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. శరత్‌ కుమార్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

1986లో సమాజంలో స్త్రీ అనే తెలుగు సినిమాతో శరత్ కుమార్ సినిమా కెరీర్ ప్రారంభమైంది. మొదట్లో నెగటివ్ పాత్రల్లో నటిస్తూ, సహాయ పాత్రలకు మారి, తర్వాత కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో కలిపి 130కి పైగా సినిమాల్లో నటించాడు. ఇతనికి అన్ని దక్షిణ భారతీయ భాషలే కాక రష్యన్ భాష కూడా సుపరిచితమే.