భారత్లో ఒక్కరోజే 62,538 కొత్త కేసులు
మొత్తం కేసులు 20,27,075..మొత్తం మృతులు 41,585
న్యూఢిల్లీ: భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ఈరోజు ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..గత 24 గంటల్లో భారత్లో 62,538 మందికి కొత్తగా కరోనా సోకింది. నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు 886 మంది మరణించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 20,27,075కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 41,585కి పెరిగింది. 6,07,384 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 13,78,106 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,27,24,134 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 5,74,783 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/