ఏపిలో గ్రామ, వార్డు వలంటీర్లకు రూ.50 లక్షల బీమా!

సిఎం జగన్‌ ఆదేశాల మేరకు బీమా

అమరావతి: ఏపి కరోనా నివారణాలో భాగంగా , డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు గ్రామాల్లో, పట్టణాల్లో సేవలందిస్తున్న వలంటీర్లకు రూ. 50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి పంచాయతీ రాజ్ శాఖకు సర్క్యులర్ జారీ అయింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల మందికి పైగా వలంటీర్లు ఉండగా, వీరందరికీ, పీఎంజీకే (ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్) ప్యాకేజీ కింద బీమా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వలంట్లీలు కరోనా పాజిటివ్ వ్యక్తులతో వలంటీర్లు నేరుగా కాంటాక్ట్ అవుతుండడంతో, వైరస్ సోకే ప్రమాదం ఉన్నందునే, సిఎం జగన్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/