పెంపుడు కుక్క దాడిలో 5 నెలల పసికందు మృతి

వీధి కుక్కలే కాదు పెంపుడు కుక్కలు కూడా ఇటీవల దాడులు చేయడం ఎక్కువైంది. ఇంట్లో ఉన్నవారిపైనే దాడికి తెగపడుతున్నాయి. తాజాగా ఇంట్లో పెంపుడు కుక్క దారిలో 5 నెలల పసికందు మృతి చెందిన ఘటన తాండూరు మండలం కరన్ కోట్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతి పరిధి బసవేశ్వర నగర్‌లో సంగెంకలాన్ గ్రామానికి చెందిన జి.నాగభూషణంకు చెందిన పాలిషింగ్‌ యూనిట్లో పనిచేస్తున్నారు. వీరికి పుట్టిన ఏకైక సంతానం సాయి(ఐదు నెలలు) ఉన్నాడు. రోజువారీగా దత్తు పాలిష్ యూనిట్లో నాపరాయి కట్ చేస్తుండగా దత్తుకు దాహం వేయడంతో భార్యకు నీళ్లు తీసుకు రమ్మని చెప్పాడు.

దీంతో లావణ్య పసికందును ఇంట్లో ఉంచి నీళ్లను తన భర్తకు అందించడానికి వెళ్ళింది. ఇంతలో అక్కడే ఉన్న పెంపుడు కుక్క ఇంట్లోకి చొరబడి ఐదు నెలల పసికందును అతి క్రూరత్వంగా కొరికి పీక్కు తిన్నది. దీంతో ఐదు నెలల సాయి మృతి చెందాడు. బాబు ఏడుస్తుండగా గమనించిన తల్లి లావణ్య హుటా హుటిన ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆసుపత్రికి హుటాహుటిన తరలించిన లాభం లేకుండా పోయింది. కోపోద్రికుడైన కుటుంబ సభ్యులు ఆ పెంపుడు కుక్కను కొట్టి చంపేశారు.