జపాన్‌లో భూకంపం

Richter scale graph
Earthquake

టోక్యో: ఈరోజు ఉదయం జపాన్‌లోని రీహోకు జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 5.0గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.10 గంటలకు ఫుకుయ్‌ ప్రిఫెక్చర్‌ ప్రాంతంలోఈ భూకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం సంభవించిన ప్రాంతానికి ఉత్తరాన 36.1 డిగ్రీల అక్షాంశ, 136.2 డిగ్రీల తూర్పు రేఖాంశాల నడుమ 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. భూ ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో భూ కంప తీవ్రత తక్కువగా ఉండటంతో సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/