దేశం లో కొత్తగా 48,786 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,11,634
మొత్తం మృతుల సంఖ్య 3,99,459
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 48,786 కేసులు రికార్డయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం.. 24 గంటల్లో 61,588 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,11,634కు చేరింది.
ఇక మరణాల విషయానికొస్తే, నిన్న 1,005 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,99,459కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,94,88,918 మంది కోలుకున్నారు. 5,23,257 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటి వరకు 33,57,16,019 డోసుల వ్యాక్సిన్లు వేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/