మలయాళ చిత్రసీమలో విషాదం..నటి రెంజూష మీనన్ ఆత్మహత్య
మలయాళ చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. నటి రెంజూష మీనన్ (35) ఆత్మహత్య చేసుకుంది. తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలోని తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని రెంజూష మీనన్ బలవన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ షాకయ్యారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
కొచ్చికి చెందిన రెంజూ షా యాంకర్గా తన కెరీర్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత ‘స్త్రీ’, ‘నిజలాట్టం’, ‘మగలుడే అమ్మ’, ‘బాలామణి’ వంటి సీరియల్స్తోపాటు ‘సిటీ ఆఫ్ గాడ్’, ‘మెరిక్కుండోరు కుంజడు’ అనే సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు కూడా తాను యాక్టివ్గా ఉన్న ఒక వీడియోను ఆమె షేర్ చేశారు. రీల్లో ఆమె సంతోషంగా కనిపించారు. అంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్త అందరినీ కలచివేస్తోంది.