పల్నాడు జిల్లాలో విషాదం..డ్రైనేజీ క్లిన్ చేస్తూ ముగ్గురు మృతి

,

పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. సత్తెనపల్లి బస్టాండ్‌ ఎదుట ఉన్న రెస్టారెంట్‌లో డ్రైనేజీ క్లిన్ చేసేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగిన ఇద్దరు కార్మికులు, రెస్టారెంట్​​ యజమాని ప్రమాదవశాత్తూ మృతిచెందారు.

వివరాల్లోకి వెళ్తే..బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ రెస్టారెంట్‌ భవనం యజమాని కొండలరావు.. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు.. ఇద్దరు కూలీలను తీసుకొచ్చారు. మ్యాన్‌హోల్‌లోకి దిగిన ఇద్దరు కూలీలు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. ఆయన కూడా అందులోకి దిగారు. ఎంతసేపటికి అతడు కూడా బయటకు రాకపోవడంతో.. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ముగ్గురూ డ్రైనేజీలోనే మృతిచెందినట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు.