నేడు వార్షిక బడ్జెట్

ఊరట కల్గిస్తుందని దేశ ప్రజలు ఎదురుచూపు

2022-23 Annual Budget in Parliament
2022-23 Annual Budget in Parliament

New Delhi: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ 11 గంటలకు పార్లమెంట్‌లో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు . ఈ బడ్జెట్‌లో తమకు ఊరట కల్పిస్తారని, ఉపశమన చర్యలు ఉంటాయని ఆయా రంగాలు మొదలుకొని దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.
కరోనా తో రెండేళ్లుగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఈ తరుణంలో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కేంద్రం భారీ తాయిలాలు ప్రకటిస్తుందని అంచనాలు ఉన్నాయి. రైతులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఈసారి బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.

మరోవైపు ఉద్యోగులు స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని ,అలాగే 80సీ కింద మినహాయింపుల పెంపుపై వేతన సిబ్బంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు రైతులు కూడా పీఎం కిసాన్ స్కీమ్ కింద అందించే ప్రయోజనాన్ని పెంచాలని కోరుకుంటున్నారు. అలాగే మధ్యతరగతి ప్రజలు ఆదాయపు పన్ను స్లాబులను సవరించాలని ఆశిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/