నేడు అక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో కరోనా వాక్సిన్‌ ప్రయోగం!

కరోనా వ్యాక్సిన్‌ను సెప్టెంబర్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడి

Coronavirus vaccine test
Coronavirus vaccine test

యూకే: కరోనా మహమ్మారికి వాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రపంచదేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే జర్మనీ, చైనా, ఆస్ట్రేలియా, యూఎస్ తదితర దేశాల్లో మానవులపై క్లినికల్ ట్రయల్స్ మొదలు కాగా తాజాగా యూకే మరో ముందడుగు వేసింది. యూకే ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో వాక్సిన్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. అయితే ఈవాక్సిన్‌ను నేడు యూకేలోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎంపిక చేసిన వారిపై తొలి డోస్ కరోనా టీకాను ఇవ్వనున్నారు. ఈ ట్రయల్స్ లో 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న 510 మంది వాలంటీర్లు పాల్గొననున్నారు. ఈ వాక్సిన్ విజయవంతం అయితే, సెప్టెంబర్ నాటికి మిలియన్ డోస్ లను తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ వెల్లడించారు. కాగా ఈ వాక్సిన్ విజయవంతం అయ్యే అవకాశాలు 80 శాతం వరకూ ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పరీక్షల్లో వాక్సిన్ సక్సెస్ సాధిస్తే, సాధ్యమైనంత త్వరగా దీన్ని అందుబాటులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు.

తాజా ఇపపేరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/