దేశంలో కొత్తగా 18,819 కరోనా కేసులు

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 13,827

corona virus-india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,819 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 13,827 మంది కరోనా నుంచి కోలుకోగా… 39 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మరోసారి లక్షను దాటింది. ప్రస్తుతం దేశంలో 1,04,555 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,34,52,164కి పెరిగింది. వీరిలో 4,28,22,493 మంది కోలుకోగా… ఇప్పటి వరకు 5,25,116 మంది మృతి చెందారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.16 శాతంగా, రికవరీ రేటు 98.55 శాతంగా, క్రియాశీల రేటు 0.24 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,97,61,91,554 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 14,17,217 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/