దేశంలో కొత్త‌గా 18,795 క‌రోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 3,36,97,581
మొత్తం మృతుల సంఖ్య 4,47,373

న్యూఢిల్లీ : దేశంలో కొత్త‌గా 18,795 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,36,97,581కు చేరింది. నిన్న‌ 26,030 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య‌ 32,9,58,002కు చేరింది. అలాగే, నిన్న‌ 179 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,47,373కు చేరింది. 2,92,206 మంది ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స అందుతోంది. మ‌రోవైపు, కేర‌ళ‌లో నిన్న‌ 11,699 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 58 మంది మృతి చెందారు. నిన్న రికార్డు స్థాయిలో 1,02,22,525 మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 87,07,08,636 వ్యాక్సిన్ డోసుల‌ను వినియోగించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/