తెలంగాణలో కొత్తగా 1,873 కేసులు నమోదు

మొత్తం కేసుల సంఖ్య 1,24,963

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా బీభత్సం కొనసాగుతుంది. గత 24 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,873 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,24,963కు చేరాయి. వైరస్‌ ప్రభావంతో మరో 9 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 827కి చేరింది. తాజాగా 1,849 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 92,837 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,299 యాక్టివ్‌ కేసులు ఉండగా, 24,216 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 0.66శాతం మరణాల రేటు ఉండగా, దేశంలో 1.78శాతంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో రికవరీ రేటు 73.3శాతంగా ఉందని చెప్పింది. తాజాగా ఆదివారం ఒకే రోజు 37,791 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 13,65,582 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/