తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత
Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో కొత్తగా 1717 మందికి కరోనా సోకింది.
అదే సమయంలో కరోనా కాటుకు ఐదుగురు మృత్యువాత పడ్డారు.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2లక్షల 12 వేల 63కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1222కు పెరిగింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/