పంజాబ్‌ చేరుకోనున్న 150 మంది విద్యార్థులు

రాజస్థాన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం ఏడు బస్సులు పంపిన సిఎం

amarinder singh
amarinder singh

పంజాబ్‌: పంజాబ్‌ సిఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజస్థాన్‌లో చిక్కుకుపోయిన పంజాబ్‌ విద్యార్థులను వెనక్కి తీసుకురావడానికి ఏడు బస్సులను పంపారు. రాజస్థాన్‌లోని కోటలో పంజాబ్‌కు చెందిన 150 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. విషయం సిఎం దృష్టికి రావడంతో స్పందించారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు ఏడు బస్సులను పంపారు. ఈ విషయాన్నిసిఎం స్వయంగా ట్వీట్ చేశారు. వారంతా నేడు రాష్ట్రానికి చేరుకుంటారని తెలిపారు. అలాగే, జైసల్మేర్‌లోని 5 క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్న 2,700 మందిని కూడా వెనక్కి తీసుకొచ్చేందుకు 60 బస్సులను పంపినట్టు పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/