తెలంగాణలో మరో 13 కొత్త మండలాల ఏర్పాటుకు నోటిఫికేషన్
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలకు నోటిఫికేషన్ జారీచేసింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో పాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ సాగిన టీఆర్ఎస్ సర్కారు.. తాజాగా రాష్ట్రంలో మరో 13 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జులై 23న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జులైలో ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
కొత్త మండలాలు ఏంటి అనేది చూస్తే..
జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం, సంగారెడ్డి-నిజాంపేట్, నల్గొండ, గట్టుప్పల్, మహబూబాబాద్-సీరోలు, ఇనుగుర్తి, సిద్దిపేట-అక్బర్ పేట-భూంపల్లి, కుకునూరుపల్లి, నిజామాబాద్-ఆలూరు, డొంకేశ్వర్, సాలూర, కామారెడ్డి-డోంగ్లి, మహబూబ్ నగర్-కౌకుంట్ల మండలాలు ఏర్పాటయ్యాయి.