నేటి నుండి బీసీ కుల వృత్తులకు తెలంగాణ సర్కార్ లక్ష సాయం

తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కుల వృత్తులు, చేతివృత్తుల వారికి కేసీఆర్ సర్కార్ తీపి కబురు తెలిపిన సంగతి తెలిసిందే. బీసీ కుల వృత్తులు, చేతివృత్తుల వారికి లక్ష సాయం అందించే కార్యక్రమాన్ని ఈరోజు సీఎం కేసీఆర్ ఘనంగా ప్రారంభించనున్నారు. మొదటగా వికారాబాద్‌ జిల్లాలో 200 మంది అర్హులకు ఆర్థిక సాయం అందజేయనున్నారు. అర్హులైన లబ్ధిదారులు తమకు అవసరమైన పనిముట్లు, ముడిసరుకులు కొనుగోలు చేసుకునేందుకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నది.

ఇక 15 బీసీ కులాలకు చెందినవారు సహాయం కోసం tsobmmsbc.cgg.gov.in అనే వెబ్సైట్ లో ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. 21 సంవత్సరాలనుంచి 55 సంవత్సరాలు ఏళ్ళు ఉండి… గ్రామాలలో లక్షన్నర, పట్టణాల్లో రెండు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు అవుతారు. ఈ అర్హతలు ఉన్నవారు ఈనెల 20 లోపు ఈ పథకం కోసం అమలు చేసుకోవాలని ఆదేశించింది కెసిఆర్ సర్కార్.